Cinema Badsha | ప్రస్తుతం టాలీవుడ్ వెలిగిపోతున్నది. ఇప్పటివరకు ఎంతో గొప్పగా చెప్పుకునే బాలీవుడ్ను టాలీవుడ్ వెనక్కి నెట్టేస్తున్నది. గత కొన్నాళ్లుగా కోట్ల రూపాయల కనకవర్షం కురిపిస్తూ ఎన్నో సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఏడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం 47 భారతీయ సినిమాలు రూ.300 కోట్ల క్లబ్లో చేరగా… వీటిలో 10 దక్షిణాది సినిమాలు ఉన్నాయి.
భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా దక్షిణాదికి చెందిన నాలుగు సినిమాలు.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, విక్రమ్, పీఎస్-1.. ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల క్లబ్లో చేరాయి. ఇప్పటివరకు మొత్తం 47 భారతీయ సినిమాలు ఈ క్లబ్లో చేరగా.. సౌత్కు చెందినవి 10 ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్కు చెందిన రెండు సినిమాలు.. కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర.. మాత్రమే రూ.300 కోట్ల క్లబ్లో చేరాయి.
కలెక్షన్ల పరంగానే కాదు, బడ్జెట్ పరంగా కూడా బాలీవుడ్ను టాలీవుడ్ చాలా వెనక్కి నెట్టేసింది. దేశంలో ఇప్పటివరకు నిర్మించిన టాప్-10 అత్యంత ఖరీదైన చిత్రాలలో 7 దక్షిణాదికి చెందినవే. వీటిలో 4 ఈ ఏడాది ఈ జాబితాలో చేరాయి. వీటిలో 3 టాలీవుడ్ నుంచి రాగా.. ఒక్క బ్రహ్మాస్త్ర సినిమా మాత్రమే బాలీవుడ్ నుంచి వచ్చింది. ఈ ఏడాది 30 బాలీవుడ్ చిత్రాల కలెక్షన్ల కంటే కేవలం 4 సౌత్ చిత్రాల (రూ.3,128 కోట్లు) వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి.
రూ.300 కోట్ల క్లబ్లో సౌత్ సినిమాలు
బాహుబలి 2
కేజీఎఫ్ 2
ఆర్ఆర్ఆర్
బాహుబలి 1
సాహో
విక్రం
పుష్ప 1
పీఎస్ 1
కబాలి
బిజిలి
ఖరీదైన టాప్ 5 సినిమాలు
ఆర్ఆర్ఆర్ రూ.550 కోట్లు, 2.O రూ.500 కోట్లు, బ్రహ్మాస్త్ర రూ.410 కోట్లు, సాహో రూ.350 కోట్లు, రాధేశ్యామ్ రూ.300 కోట్లు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ దాదాపు రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లుగా తెలుస్తున్నది.