ఇటీవల ‘కార్తికేయ-2’ చిత్రంతో విజయాన్ని అందుకున్న జంట నిఖిల్ సిద్ధ్దార్థ, అనుపమ పరమేశ్వరన్లు కలిసి నటిస్తున్న మరో చిత్రం ‘18 పేజిస్’. సూర్య ప్రతాప్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీవాస్ నిర్మాత. ఈ చిత్రంలోని ‘నన్నయ రాసిన..’ అనే లిరికల్ వీడియోను ఈ నెల 22 విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. డిసెంబర్ 23న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి, అశోక్ బండ్రెడ్డి.