‘క్రేజీఫెలో’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే పాత్ర. నా పాత్రలోని స్వభావం అందరికి ఎంటర్టైనింగ్గా ఉంటుంది’ అన్నారు ఆది సాయికుమార్. ఆయన నటించిన తాజా చిత్రం ‘క్రేజీఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. నేడు విడుదల కానుంది. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘లవ్లీ, ప్రేమకావాలి తరహాలో యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది.
ఈ చిత్రం కోసం బరువు కూడా తగ్గాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైనింగ్ సినిమా చూశామనే భావన కలుగుతుంది. చూసిన వాళ్లు పదిమందికి చెబుతారు. ఇక నుంచి సినిమాల విషయంలో సెలెక్టివ్గా వుండాలని, కథలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం ‘టాప్గేర్’ అనే థ్రిల్లర్తో పాటు మరో క్రైమ్ థ్రిల్లర్ను చేస్తున్నాను. పులి-మేక వెబ్సీరిస్లో కూడా నటిస్తున్నాను’ అన్నారు.