న్యూయార్క్ : కొవిడ్-19 మహమ్మారి వెంటాడిన సమయంలో వర్క్ ఫ్రం హోమ్ పద్ధతి ప్రాచుర్యం పొందగా కరోనా తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు క్రమంగా తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్ల వరకూ ఉద్యోగులకు హైబ్రిడ్ మోడల్ ఆఫర్ చేస్తూ వారానికి కొద్దిరోజులు ఆఫీసులకు రావాలని కోరాయి. మరికొన్ని సంస్ధలు పూర్తిస్ధాయిలో వర్క్ ఫ్రం హోం పద్ధతికి స్వస్తిపలికాయి.
ఇక వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ, రిమోట్ వర్కింగ్ రివల్యూషన్గా పేరొందిన జూమ్ (Zoom) కొవిడ్ అనంతరం తొలిసారి తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని కోరుతోంది. కార్యాలయాలకు ఉద్యోగులు స్వయంగా హాజరయ్యే అనుభవం అవసరమని కంపెనీ కోరుకుంటున్నదని జూమ్ సీఈవో ఎరిక్ యువన్ ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు.
కంపెనీ కార్యాలయాలని 50 మైళ్ల దూరంలో నివసించే ఉద్యోగులు ఆఫీస్కు రావాలని కోరారు. వారానికి రెండు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని జూమ్ కోరుతోంది. నెలకు 8 రోజులు కార్యాలయాలకు రావాలని ఉద్యోగులను కంపెనీ కోరింది. దూరాలోచనతో రూపొందించిన హైబ్రిడ్ మోడల్ జూమ్ కోసం సరైన ఫలితాలను ఇస్తుందని తాము నమ్ముతున్నామని జూమ్ ప్రతినిధి పేర్కొన్నారు. కొవిడ్-19 వేగంగా ప్రబలిన సమయంలో జూమ్కు విపరీతమైన డిమాండ్ నెలకొంది. పెద్దసంఖ్యలో ఉద్యోగులు, విద్యార్ధులు వీడియో కాన్ఫరెన్స్ కోసం జూమ్ ప్లాట్ఫాం సేవలు పొందారు.
Read More :