Zoom | వీడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ జూమ్ (Zoom) కూడా తన ఉద్యోగులకు ఉద్వాసన పలుకడం ప్రారంభించింది. ఇటీవలే సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టూంబ్ను ఇంటికి సాగనంపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అయితే, గ్రెగ్ ఉద్వాసనకు కారణాలేమిటో తెలుపలేదు. గతేడాది జూన్లోనే జూమ్ ప్రెసిడెంట్గా గ్రెగ్ టూంబ్కు ప్రమోషన్ లభించింది. కేవలం ఎనిమిది నెలల్లోనే ఆయనకు ఉద్వాసన పలుకడం పలువురిని ఆశ్చర్య చకితుల్ని చేసింది.
గ్రెగ్ స్థానంలో మరో వ్యక్తిని సంస్థ ప్రెసిడెంట్గా మరో వ్యక్తిని ప్రకటించలేదు. గ్రెగ్ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచన చేయలేదని జూమ్ అధికార ప్రతినిధి తెలిపారు. సంస్థ ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉంచడానికి గల కారణాలు వెల్లడించలేదు. కంపెనీలో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్గా గ్రెగ్ టూంబ్ 2019 నుంచి చేరారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయ్యారు. ఇంతకుముందు 2021 మే వరకు గూగుల్లో సేల్స్, వర్క్ స్పేస్, సెక్యూరిటీ, జియో ఎంటర్ ప్రైజెస్ విభాగాల వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు.
గత నెలలో జూమ్ భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇది సంస్థలోని 15 శాతం మంది ఉద్యోగులతో సమానం. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి 16 వారాల శాలరీ, హెల్త్ కవరేజీ, 2023 ఆర్థిక సంవత్సర బోనస్, ఆరు నెలల పాటు స్టాక్ ఆప్షన్ అధికారం కల్పించారు. ఇతర దేశాల్లో ఆగస్టు 9 వరకు టైం ఇచ్చారు.