కంపెనీలతో పాటు ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించనుందనే వార్తలు వినిపించాయి. ఉద్యోగుల తొలగింపు నిజమేనని జొమాటో అధికారికంగా ధ్రువీకరించింది. దేశవ్యాప్తంగా 3శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ఉద్యోగులు పనితీరు ఆధారంగా 3 శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తామని, ఇది తరచూ జరిగే ప్రక్రియ అని జొమాటో అధికారి ఒకరు తెలిపారు.
వారం రోజుల వ్యవధిలోనే జొమాటో ఉన్నతస్థాయి ఉద్యోగులు రాజీనామా చేశారు. కొత్త ఆవిష్కరణ విభాగం హెడ్ రాహుల్ గంజూ కూడా ఈ నెలలో కంపెనీని వీడాడు. కో ఫౌండర్గా ఉన్న మోహిత్ గుప్తా రెండు రోజుల క్రితం జొమాటోకు గుడ్ బై చెప్పాడు. లాక్డౌన్ సమయంలో నష్టాలు రావడంతో కంపెనీ 2020 మే నెలలో దాదాపు 13 శాతం మందిని ఇంటికి పంపించేసింది. గురుగ్రామ్కు చెందిన దీపిందర్ గోయల్, పంకజ్ చద్ధా జొమాటోను 2008లో ఏర్పాటు చేశారు.