ముంబై : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్తో కలిసి జెరోధా సహవ్యవస్ధాపకులు (Zerodha CEO) నిఖిల్ కామత్ వీక్షించారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు హాజరైన నిఖిల్ తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
గేమ్ సందర్భంగా తాను కీలకమైన ఆర్ధిక పాఠాలను నేర్చుకున్నానని శక్తికాంతదాస్తో కలిసిఉన్న ఫొటోగ్రాఫ్ను ఆయన పోస్ట్ చేశారు. కొన్ని గెలుపులు..మరికొన్ని ఓటములు…++ మ్యాచ్ సందర్భంగా బెస్ట్ టీచర్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నుంచి బెస్ట్ లెసన్ అని నిఖిల్ కామత్ రాసుకొచ్చారు.
ఈ హై ప్రొఫైల్ మ్యాచ్కు ఫైనాన్షియల్ గురూలు, బాలీవుడ్ సెలబ్రిటీలే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్టేడియానికి వచ్చి భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఇంకా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్, ఆర్యన్, సుహానా, అబ్రహం, దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్, ప్రకాష్ పడుకోన్, లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భో్లే, ఆయుష్మాన్ ఖురానా, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ నటుడు వెంకటేష్ సహా పలువురు ప్రముఖులు హాజరై మ్యాచ్ను ఆస్వాదించారు.ఈ మ్యాచ్లో భారత్ను ఓడించిన ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ను చేజిక్కించుకుంది.
Read More :
Mohammad Siraj | వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సిరాజ్