Yezdi : దేశీ మోటార్సైక్లింగ్ కల్చర్తో పెనవేసుకున్న యజ్డి బైక్ల గురించి వినని వారుండరు. మహీంద్రా సొంతమైన క్లాసిక్ లెజెండ్స్ ఇప్పడు భారత్ మార్కెట్లో ఏకంగా మూడు యజ్డి బైక్లను లాంఛ్ చేసింది. యజ్డి రోడ్స్టర్, యజ్డి స్ర్కాంబ్లర్తో పాటు రెట్రో మోడ్రన్ లుక్లో యజ్డి అడ్వంచర్ పేరుతో మూడు బైక్లను యజ్డి లాంఛ్ చేసింది.
జావా పెరక్ తరహాలో మూడు మోటార్సైకిళ్లు ఒకే సింగిల్ సిలిండర్ 334 సీసీ మోటార్ను కలిగి ఉంటాయి. మూడు బైక్ల్లో ట్రిప్ మీటర్తో కూడిన ఎల్సీడీ కన్సోల్, డిస్టెన్స్ టూ ఎమ్టీ టైమ్, ఏబీఎస్ మోడ్, గేర్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లున్నాయి.
ఇక అడ్వంచర్లో టర్న్ బై టర్న్ నేవిగేషన్ వెసులుబాటు కోసం బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. యజ్డి రోడ్స్టర్ రూ 1.98 లక్షల ఎక్స్-షోరూం ధరకు అందుబాటులో ఉండగా యజ్డి స్క్రాంబ్లర్ రూ 2.05 లక్షల నుంచి, యజ్డి అడ్వంచర్ సిరీస్ రూ 2.10 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.