ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.228.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది యెస్ బ్యాంక్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.160.41 కోట్ల లాభంతో పోలిస్తే 47 శాతం అధికం. గత త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.1 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.4 శాతానికి పరిమితమయ్యాయి.
ముంబై, అక్టోబర్ 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.228.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది యెస్ బ్యాంక్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.160.41 కోట్ల లాభంతో పోలిస్తే 47 శాతం అధికం. గత త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.1 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.4 శాతానికి పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 150 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది 20 శాఖలను ఆరంభించినట్టు చెప్పారు. ఈ సారి రుణ వితరణలో 15 శాతం వృద్ధి, డిపాజిట్లలో 18 శాతం అంచనావేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,200 కోట్లు రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరినట్టు చెప్పారు.