న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి వైజెడ్ఎఫ్-ఆర్2 స్పోర్ట్స్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.30 లక్షలుగా నిర్ణయించింది. దీంట్లో వైజెడ్ఎఫ్-ఆర్2 ధర రూ.2,30,500గాను, మరో రకం రూ.2,39,500గాను, ఎం రకం రూ.2.53 లక్షలకు విక్రయిస్తున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
204 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారైన ఈ బైకు మూడు రకాల్లో, ఐదు కలర్స్లో లభించనున్నది. వచ్చే నెల చివరి నుంచి బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అందచేయనున్నట్టు తెలిపింది.