ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా అడుగులు
వచ్చే వారం అధికారిక ప్రకటన
బీజింగ్, మార్చి 26: ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల్లో ఒకటైన షియామీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నది. త్వరలో ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న షియామీ.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటర్ కంపెనీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే చర్చలు మొదలైనట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇరు పక్షాలు ఇంకా ధ్రువీకరించకపోయినప్పటికీ వచ్చే వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.