హైదరాబాద్ : వినికిడి సహాయ పరిశ్రమలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న డబ్ల్యూఎస్ ఆడియాలజీ (WSA) హైదరాబాద్లో తన కొత్త పరిశోధనాభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) కేంద్రాన్ని ప్రారంభించింది. దీనిని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్(Jayesh Ranjan) ప్రారంభించారు. కంపెనీ విస్తరణలో భారత్లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, భారతదేశ జనాభాలో 6.3% మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, 1.6 బిలియన్లకు పైగా వ్యక్తులు ఏదో ఒక రకమైన వినికిడి లోపంతో బాధపడుతున్నారు.
కాగా, 20 శాతం కంటే తక్కువ మందికి అవసరమైన వినికిడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ పరిశోధనాభివృద్ధి కేంద్రం తమ నెట్వర్క్లో ఎంతో కీలకమైనదని, వినియోగదారు అనుభవాలు, ఫలితాలను గణనీయంగా మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతలతో తమ ఉత్పత్తి అభివృద్ధిని మెరుగుపరుస్తుందదని’’ అని డబ్ల్యూఎస్ ఆడియాలజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జోర్గ్ బ్రాండ్షీడ్(Joerg Brandscheid) అన్నారు. హైదరాబాద్లో కొత్త హబ్ కేవలం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి మాత్రమే కాదని, ఇది టాలెంట్ డెవలప్మెంట్, రీసెర్చ్, స్థానిక సంస్థలతో సహకారం కోసం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు.
వినికిడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తాము మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నామని తెలిపారు. స్థానిక, ప్రపంచ అవసరాలు తీర్చేలా పరిశోధనాభివృద్ధి కేంద్రం వినికిడి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి స్థానిక మార్కెట్ అవసరాలతో ప్రపంచ సాంకేతిక ధోరణులను సమతుల్యం చేయడానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 250 మందికి పైగా ఇంజినీర్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిద్దిద్దామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం, వినియోగదారు అవసరాలకు మరింత సూక్ష్మంగా గుర్తించి సరి చేయడానికి, వినికిడి సంరక్షణ నిపుణుల కోసం వర్క్ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడం, రోగి పరస్పర చర్యలను క్రమబద్ధీకరించడం, వినూత్న విధానాలను అన్వేషించడం తదితర కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. Widex, Signia, Rexton, Audio Service,Vibe వంటి విభిన్న బ్రాండ్స్, హోల్సేల్, రిటైల్, ఆన్లైన్, మేనేజ్డ్ కేర్, డయాగ్నస్టిక్ సొల్యూషన్లలో విభిన్న ఆస్తులతో కంపెనీ చురుగ్గా పని చేస్తుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం wsa.comని సందర్శించాలని సూచించారు.