ఇక నుంచి ఏటీఎంల ద్వారా కార్డుల్లేకుండా నగదు విత్డ్రా చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని బ్యాంక్లనూ అనుమతించాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని బ్యాంక్లు వాటి స్వంత ఖాతాదారులకు మాత్రమే కార్డ్లెస్ విత్డ్రాయిల్స్ను ఆఫర్ చేసేందుకు అనుమతి ఉంది. ఇక నుంచి యూపీఐ ఆధారంగా ఏటీఎం నెట్వర్క్ల్లో అన్ని బ్యాంక్లు ఈ సదుపాయాన్ని అందించాలని రిజర్వ్బ్యాంక్ ప్రతిపాదిం చింది. కార్డుల స్కిమ్మింగ్, క్లోనింగ్ తదితర మోసాలు అరికట్టేందుకు కార్డ్లెస్ లావాదేవీలు అవసరం ఉందని, వీటికి యూనీఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ను ఉపయోగించడం ద్వారా ఖాతాదారు ఆథరైజేషన్ను బ్యాంక్లు పొందుతాయని శక్తికాంత్ దాస్ వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఎన్పీసీఐ, ఏటీఎం నెట్వర్క్లు, బ్యాంక్లకు రిజర్వ్బ్యాంక్ ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తుందని శక్తికాంత్ దాస్ తెలిపారు.