Wipro-Azim Premji | ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ తన ఇద్దరు కొడుకులకు దాదాపు రూ.500 కోట్ల విలువైన కోటికి పైగా షేర్లు గిఫ్ట్గా ఇచ్చేశారు. గత వారం వరకూ 22.58 కోట్ల షేర్లు కలిగి ఉన్న అజీం ప్రేమ్జీ.. తన ఇద్దరు కొడుకులు రిషాద్ ప్రేమ్జీ, తారిఖ్ ప్రేమ్జీ లకు ఒక్కొక్కరికి 51,15,090 షేర్లు బహుమతిగా ఇచ్చేశారు. వీరిలో రిషాద్ ప్రేమ్జీ.. విప్రో చైర్ పర్సన్గా పని చేస్తున్నారు. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వ్యవహరాలను తారిఖ్ ప్రేమ్జీ పర్యవేక్షిస్తున్నారు.
ఈ నెల 20న రిషాద్, తారిఖ్లకు అజీం ప్రేమ్ జీ షేర్లు కేటాయించారు. విప్రో షేర్ విలువ రూ.484.90 కాగా, మొత్తం 1,02,30,180 కోట్ల షేర్ల విలువ రూ.496 కోట్లు అని తెలుస్తున్నది. విప్రోలో అజీం ప్రేమ్జీ కుటుంబానికి 4.43 శాతం వాటా ఉంది. అందులో అజీం ప్రేమ్జీకి 4.12, ఆయన భార్య యాస్మిన్ ప్రేమ్జీకి 0.05 శాతం, ఇద్దరు కొడుకులకు 0.13 శాతం చొప్పున షేర్లు ఉన్నాయి.
గతేడాది మార్చి నెలాఖరు నాటికి విప్రోలో ప్రమోటర్ల వాటా 72.9 శాతం. హాసం ట్రేడర్స్, ప్రాజిమ్ ట్రేడర్స్, జాష్ ట్రేడర్స్ 58 శాతం, అజీం ప్రేమ్ జీ ఫిలాంథ్రోపిక్ ఇన్సియేటివ్స్కు 0.27 శాతం, అజీం ప్రేమ్జీ ట్రస్ట్కు 10.18 శాతం వాటా ఉంది. మరో 0.03 శాతం హషం ఇన్వెస్ట్ మెంట్ అండ్ కో కంపెనీ వాటా కలిగి ఉంటుంది.