న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశీయ ఎగుమతులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గత నెలలోనూ 27.16 శాతం పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో 23.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 56 శాతం ఎగిసి 52.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు 33.81 బిలియన్ డాలర్లుగా ఉన్నది.