Wholesale Inflation | మార్చిలో హోల్సేల్ ద్రవ్యోల్బణం కాస్త కరుణించింది. దాదాపు రెండున్నరేండ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. గత మార్చి టోకు ద్రవ్యోల్బణం 1.34 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం దిగి రావడానికి ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడమే కారణం. వరుసగా పదో నెల హోల్సేల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలోనే నమోదవుతూ వచ్చింది. గతేడాది మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 14.63 శాతంగా నమోదైతే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.85 శాతానికి పరిమితమైంది.
గత నెలలో ఆహార పదార్థాల ధరలు పెరిగిపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం 5.48 శాతంగా నమోదైంది. గత ఫిబ్రవరిలో ఇది 3.81 శాతం మాత్రమే. గోధుమల ధర 9.16, పప్పులు 3.03 శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 8.96 శాతం నమోదు కాగా, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం -0.77 శాతానికి పడిపోయింది. ఇక కూరగాయల ద్రవ్యోల్బణం సైతం -2.22 శాతం, నూనె గింజల ద్రవ్యోల్బణం 15.05 శాతంగా రికాైర్డెంది. గత నెల చిల్లర ద్రవ్యోల్బణం కూడా 15 నెలల కనిష్ట స్థాయికి చేరి 5.66 శాతం వద్ద స్థిర పడింది. గత ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా రికాైర్డెన సంగతి తెలిసిందే.