న్యూఢిల్లీ, జనవరి 12: సర్వీసుల రంగం దేశీయ ఆర్థికాభివృద్ధికి ఊతం గా నిలుస్తున్నప్పటికీ, పారిశ్రామిక రంగం నానాటికీ కుంచించుకుపోతున్నది. 2023 నవంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ 2.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చినట్టు జాతీయ గణాంకాల శాఖ తెలిపింది.
ఈ వృద్ధి రేటు 8 నెలల కనిష్ఠం. 2022 నవంబర్లో 7.6 శాతంగా నమోదైన పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఏడాది తిరిగేసరికల్లా 2.4 శాతానికి పడిపోయింది. 2023 మార్చి తర్వాత ఇంత కనిష్ఠానికి క్షీణించడం ఇదే ప్రథమం.