MS Dhoni | ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు సారధిగా మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఐపీఎల్-2022 ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం నవంబర్లోనే ఉన్నాం. అయితే, సీఎస్కేకు ఆడే విషయమై తప్పక ఆలోచిస్తా. దీనిపై నిర్ణయానికి చాలా టైం ఉంది అని అన్నాడు.
తన కెరీర్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటానని, అంతర్జాతీయంగా తన చివరి మ్యాచ్ను రాంచీలోనే ఆడాలనుకున్నా.. అలాగే చివరి మ్యాచ్ రాంచీలో ఆడాక రిటైర్మెంట్ తీసుకున్నా. ఐపీఎల్లోనూ టీ-20 చివరి మ్యాచ్ కూడా చెన్నైలోనే ఆడతా.. అది 2022లోనా.. మరో ఐదేండ్ల తర్వాతనా అన్నది తెలియదన్నాడు ధోనీ.
శనివారం చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 విజయోత్సవ వేడుకల్లో ఎంఎస్ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కే జట్టును తొమ్మిదిసార్లు ఫైనల్స్కు చేర్చి, నాలుగు దఫాలు కప్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీని వదులుకునేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధంగా లేదని తెలుస్తోంది.