న్యూఢిల్లీ : వోక్స్వ్యాగన్ ఇండియా భారత్ మార్కెట్లో ఈనెల 7న 2021 వోక్య్వ్యాగన్ టైగున్ ఫేస్లిఫ్ట్ను లాంఛ్ చేయనుంది. కంపెనీ ఇటీవల ఔరంగాబాద్ ప్లాంట్ నుంచి 2021 వోక్స్వ్యాగన్ టైగున్ ఫేస్లిఫ్ట్ ప్రొడక్షన్ను ప్రారంభించింది.
న్యూ వెహికల్ స్లిమ్ సెట్ ఎల్ఈడీ హెడ్ల్యాంపులు, రీడిజైన్డ్ గ్రిల్, రీవ్యాంప్డ్ ఫ్రంట్ బంపర్, ఫాగ్ ల్యాంప్స్ వంటి పీచర్లతో మరింత బోల్డ్గా రానుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, రీడిజైన్డ్ రియర్ బంపర్ వంటి పలు మార్పులు చేపట్టింది.
2021 వోక్స్వ్యాగన్ టైగున్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే హ్యుందాయ్ టక్సన్, జీప్ కంపాస్, సిట్రాన్ సీ5ఎయిర్క్రాస్, టాటా హ్యారియర్, ఎంజీ హెక్టార్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. ఈ కారు ధర రూ 27 లక్షల నుంచి రూ 30 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది.