న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల బ్రాండ్ వోక్స్వ్యాగన్ ఇండియా ప్రవేశపెట్టిన లేటెస్ట్ వోక్స్వ్యాగన్ టైగన్కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. భారత్ మార్కెట్లో లాంఛ్ చేసినప్పటి నుంచి 18,000కు పైగా బుకింగ్స్ లభించాయని వోక్స్వ్యాగన్ ఇండియా తెలిపింది.
అత్యాధునిక ఫీచర్లతో ముందుకొచ్చిన న్యూ వోక్స్వ్యాగన్ టైగన్కు భారీ డిమాండ్ నెలకొందని, ప్రస్తుతం టైగన్కు వెయిటింగ్ పిరియడ్ రెండు నెలలుగా ఉందని వోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా లిమిటెడ్ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా పేర్కొన్నారు. టైగన్ లాంఛ అయిన తర్వాత అక్టోబర్లో తమ మొత్తం కార్ల విక్రయాలు 50 శాతం మేరకు ఊపందుకున్నాయని చెప్పారు. చిప్ కొరత వంటి సమస్యలు ఎదురైనా కస్టమర్లకు కార్ల సత్వర డెలివరీ కోసం డీలర్లతో కలిసి కసరత్తు సాగిస్తున్నామని తెలిపారు.