హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ ఎన్బీఎఫ్సీ వివిఫై ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్..సిరీస్ బీ ఫండింగ్లో భాగంగా 75 మిలియన్ డాలర్లు(రూ.620 కోట్ల) నిధులను సమీకరించింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు అనిల్ పినపాల మాట్లాడుతూ..వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు చెప్పారు. గడిచిన ఏడాదిలో 5 లక్షల కస్టమర్లకు రూ.1,000 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 800 మంది సిబ్బంది ఉండగా, వచ్చే ఏడాదిన్నరలోగా ఈ సంఖ్యను 2 వేలకు పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్ల ఆదాయంపై రూ.16 కోట్ల లాభాన్ని గడించింది. ఈ ఏడాది ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉందన్న ఆయన..రూ.3 వేల కోట్ల రుణాలను మంజూరు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.