ఆవిష్కరించిన అపోలో కంప్యూటింగ్
హైదరాబాద్, మే 5: హైదరాబాద్కు చెందిన ప్రముఖ రక్షణ, ఏరోస్పెస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ సంస్థ అపోలో కంప్యూటింగ్ ల్యాబోరేటరిస్..ప్రపంచంలో తొలిసారిగా నాన్-ఇన్వసివ్ వెంటిలేటర్ను ఆవిష్కరించింది. బ్రీఫ్కేస్ పరిమాణంలో కేవలం 3 కేజీల కంటే తక్కువ బరువు కలిగిన ‘స్వాస్త్ వాయు’ వెంటిలేటర్ మెడికల్ వార్డులు, తాతాల్కికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, హెల్త్కేర్ ఆపరేటర్లు, ఇంటి వద్దనే కొవిడ్ చికిత్సకోసం వినియోగించుకోవచ్చునని కంపెనీ ఎండీ బద్దం జైపాల్ రెడ్డి తెలిపారు. సీఎస్సీఎస్ఐఆర్-నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ వెంటిలేటర్ చిన్న స్థాయి ఆసుపత్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 2- 4 గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ పరికరం ధర లక్ష రూపాయలుగా నిర్ణయించింది. స్వాస్త్వాయ్ నిమిషానికి 1.5- 3 లీటర్ల ఆక్సిజన్ను అందిస్తున్నది. కరోనా వైరస్తో వెంటిలేటర్ల కొరత తీర్చడానికి ఈ స్వాస్త్వాయ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.