న్యూఢిల్లీ, మే1: గత నెల ఏప్రిల్లో వాహన విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ 4.5 లక్షలుగా ఉన్నట్టు అంచనా. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా తదితర కంపెనీల కార్లకు భారీగా డిమాండ్ కనిపించింది. మారుతీ దేశీయ విక్రయాలు మునుపెన్నడూ లేనివిధంగా 1,91,122 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో నిరుడు డిసెంబర్లో నమోదైన 1,82,165 యూనిట్ల రికార్డు కనుమరుగైంది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వాగనార్ మాడళ్లకు ఆదరణ దక్కింది. ద్విచక్ర వాహన విభాగంలో హీరో, హోండా, సుజుకీ తదితర వాహనాల సేల్స్ బాగా పెరిగాయి.
ఎఫ్పీఐలు రివర్స్ గేర్
న్యూఢిల్లీ, మే 1: భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటూనే ఉన్నారు. ఏప్రిల్లోనూ రూ.60,847 కోట్లను ఉపసంహరించారు. దీంతో ఈ ఏడాది మొదలు తరలిపోయిన విదేశీ పెట్టుబడుల విలువ రూ.1.92 లక్షల కోట్లుగా నమోదైంది.