న్యూఢిల్లీ, మార్చి 23: ప్రముఖ ఫార్మా సంస్థ జీల్యాబ్ ప్రచారకర్తగా..వీర్ సావర్కర్ సినిమా నటుడు రణ్దీప్ హుడా నియమితులయ్యారు. మరోవైపు, రోగులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సంస్థ అన్ని రకాల ఔషధాలను 90 శాతం వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా సొంతంగా రిటైల్ అవుట్లెట్లను కలిగివున్న సంస్థ..2 వేలకు పైగా ఫ్రాంచైజ్ పద్దతిన స్టోర్లను నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్ రోహిత్ ముకుల్ తెలిపారు. అలాగే ప్రతి నెల 20 వేలకు పైగా ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయన్నారు. వచ్చే మూడేండ్లలో దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా సొంత అవుట్లెట్లతోపాటు 5 వేల ఫ్రాంచైజ్ అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.