UPI | యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది చెల్లింపులు చేయలేకపోయారు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సహా యాప్లో యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాము యూపీఐ చెల్లింపులో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పలు బ్యాంకులకు చెందిన కస్టమర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా బ్యాంక్తో పాటు మరికొన్ని బ్యాంకుల ఖాతాదారులు యూపీఐ సేవలు నిలిచిపోయాయి.
చాలా సమయంతో తర్వాత మళ్లీ యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, యూపీఐ సేవలు స్తంభించడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) స్పందించింది. మంగళవారం సాయంత్రం పలు బ్యాంకుల సిస్టమ్స్లో లోపాల కారణంగా యూపీఐ చెల్లింపులపై ప్రభావం చూపిందని పేర్కొంది. ఈ సమయంలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొంది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. కొన్ని బ్యాంకుల వ్యవస్థల్లో అంతర్గత సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న ఎన్సీపీఐ.. బ్యాంకుల పేర్లను మాత్రం వెల్లడించలేదు.