న్యూఢిల్లీ, జూన్ 1 : యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో రూ.29.90 లక్షల కోట్ల 23.2 బిలయన్ డాలర్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగినట్టు ఎన్పీసీఐ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ నెలలో రూ.29.03 లక్షల కోట్ల లావాదేవీలు జరుగగా, అంతక్రితం ఏడాది ఇదే నెలలో రూ.25.14 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి.
విలువ పరంగా చూస్తే క్రితం ఏడాది ఇదే నెలలో 18.67 బిలియన్ల లావాదేవీలు జరుగగా, ఈసారి 24 శాతం వృద్ధితో 23.2 బిలియన్లకు చేరుకున్నాయని క్యాష్ఫ్రీ పేమెంట్స్ కో-ఫౌండర్, సీఈవో ఆకాశ్ సిన్హా తెలిపారు. వేసవి ప్రయాణాలు, ఐపీఎల్ 2026, కాలానుగుణంగా వినియోగదారులు యూపీఐ ద్వారా తమ చెల్లింపులు జరుపడం వల్లనే రికార్డు స్థాయికి చేరుకున్నాయన్నారు.