UPI Transactions | యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఏ) లావాదేవీల్లో డిసెంబర్ సరికొత్త రికార్డు నమోదైంది. కరోనా నేపథ్యంలో రోజురోజుకు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. గత నెలలో 456 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇంతకుముందు 2021 అక్టోబర్లో నమోదైన 421 కోట్ల లావాదేవీల రికార్డును కూడా అధిగమించింది. డిసెంబర్లో ఆన్లైన్ లావాదేవీల్లో రూ.8.27 లక్షల కోట్ల చెల్లింపులు జరుగడమే కొత్త రికార్డుగా రిజిస్టరైంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆర్థిక లావాదేవీల్లో ఆన్లైన్ పేమెంట్స్ పెరుగడానికి డిసెంబర్ ట్రాన్సాక్షన్స్ నిదర్శనం అని బ్యాంకర్లు అంటున్నారు.
ఫెస్టివ్ సీజన్ సందర్భంగా గత అక్టోబర్లో ఈ-కామర్స్ సంస్థల ఆన్లైన్ సేల్స్ పెరగడంతో యూపీఐ ట్రాన్సాక్షన్ సరికొత్త రికార్డు నెలకొల్పాయి. తర్వాత 2021 నవంబర్లో స్వల్పంగా యూపీఐ ట్రాన్సాక్షన్లు తగ్గుముఖం పట్టాయి. 2020తో పోలిస్తే డిసెంబర్ ట్రాన్సాక్షన్స్ రూపంలో 9 శాతం, లావాదేవీల విలువలో 7.6 శాతం వృద్ధి రికార్డైంది. 2021లో 3800 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగితే వాటి విలువ రూ.73 లక్షల కోట్లు. నూతన సంవత్సర వేడుక కోసం డిసెంబర్ 31న రికార్డు లావాదేవీలు రికార్డయ్యాయి.