హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కేంద్రం ఈ నెల 15న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో చర్చలు జరుపనున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ర్టాల సీఎంలకు లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో వృద్ధి కనిపిస్తున్నదని, ఈ వృద్ధి కొనసాగితే రాష్ర్టాలకు పెట్టుబడులు, ఉద్యోగాలు, రాబడులు పెరుగుతాయని తెలి పారు. కేంద్రం రాష్ర్టాల సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 15న మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు సీఎంలు, ఆర్థిక మం త్రులు వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొనాలని కోరారు.