PF Interest | ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్రం నిర్ణయించిందని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయమై త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనున్నదని సమాచారం.
2020-21 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.5 శాతం వడ్డీ జమ చేయాలని గత మార్చిలోనే ఈపీఎఫ్వో బోర్డు చేసిన ప్రతిపాదనకు కార్మికశాఖ ఆమోదం తెలిపింది. తాజాగా ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదించినట్లు ఆ వర్గాలు చెప్పారు. దీంతో ఐదు కోట్ల మందికిపైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈ వడ్డీని జమ చేస్తారని సమాచారం.
అయితే, గత ఏడేండ్లలో ఈపీఎఫ్పై వడ్డీరేటు 8.5 కనిష్ఠం. 2015-16లో 8.8 శాతం, అంతకుముందు 2013-14, 2014-15లలో 8.75 శాతం, తిరిగి 2016-17, 2018-19ల్లో 8.65 శాతం వడ్డీ రేటు జమ చేసింది. అయితే, కోవిడ్-19 వేళ ఖాతాదారులు విత్డ్రాయల్స్ పెంచారు. వారి నుంచి డిపాజిట్లు తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్పై వడ్డీని 8.5 శాతానికి ఈపీఎఫ్ బోర్డు తగ్గించింది.