హైదరాబాద్, జనవరి 5: సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్ కోసం ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్లో ఓ వీఏపీటీ ల్యాబ్ను ప్రారంభించింది. బ్యాంక్కు ఇక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈ వీఏపీటీ (వాల్నురబిలిటీ అసెస్మెంట్, పెనట్రేషన్ టెస్టింగ్) ల్యాబ్ను యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాజ్కిరణ్ రాయ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ సురక్షితంగా జరిగేందుకు ఇది తోడ్పతుందన్నారు. వీఏపీటీ ల్యాబ్ ద్వారా కొత్త బ్యాంకింగ్ సాధనాలపై పూర్తి సెక్యూరిటీ పరీక్షలను నిర్వహించి, ఆ సాధనాల్ని త్వరితంగా బ్యాంక్ విడుదల చేయగలుగుతుందన్నారు. ఇదిలా ఉంటే సైబర్ సెక్యూరిటీ కార్యకలాపాల్ని పటిష్టపర్చేందుకు హైదరాబాద్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.