ముంబై, జూన్ 2: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కో-ఫైనాన్సింగ్ సేవలు అందించడంలో భాగంగా స్మాల్ ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ)తో ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ లాల్ సింగ్, సిడ్బీ చీఫ్ జనరల్ మేనేజర్ వివేక్ కుమార్ మల్హోత్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంయుక్తంగా రుణాలు అందించనున్నారు. దీంతో బ్యాంక్ ఖాతాదారులు పెరగడంతోపాటు నిధులు అవసరమైన చిన్న స్థాయి సంస్థలకు లభించనున్నాయి.