హైదరాబాద్, జూన్ 3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఏ మణిమేఖలాయ్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మణిమేఖలాయ్..ఇటీవల పదవీ విరమణ చేసిన రాజ్ కిరణ్ రాయ్ స్థానంలో నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో ఐదేండ్లపాటు ఉండనున్నారు. యూబీఐ ఎండీగా మహిళా నియమితులవడం ఇదే తొలిసారి.
బ్యాంకింగ్ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న మణిమేఖలాయ్..1988లో విజయా బ్యాంక్లో ఆఫీసర్గా తన కేరియర్ను ప్రారంభించారు. ఆ తర్వాతి క్రమంలో బ్రాంచ్ హెడ్గాను, రీజినల్ హెడ్గాను, పలు కార్పొరేట్ ఆఫీస్ అధిపతిగాను విధులు నిర్వహించారు. యూబీఐలో చేరకముందు ఆమె..కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు.