న్యూఢిల్లీ, జూన్ 18: ఎడ్యుటెక్ స్టార్టప్ అన్అకాడమి మరోమారు ఉద్యోగులను తొలగించింది. రెండు నెలల క్రితం 600 మంది సిబ్బందిపై వేటు వేసిన సంస్థ.. తాజాగా మరో 150 మందిని తొలగించింది. ప్రస్తుతం ఛండీగడ్కు చెందిన పీజీ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రీపరేషన్ ప్లాట్ఫాం ప్రెప్లీడర్లో విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించింది. 2020లో ఈ సంస్థను అన్అకాడమీ 50 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు తొలగించిన వారి శాతం 10కి పైగా ఉన్నది. పనితీరును మెరుగుపరుచడంలో భాగంగానే ఈ తొలగింపులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. దీనిపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి.