Uber Fare Hike | క్యాబ్ ఆగ్రిగేటర్ ఉబర్ ఇండియా ప్రయాణ చార్జీలు పెంచేసింది. ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో 12 శాతం చార్జీలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇంతకుముందు ముంబైలో 15 శాతం పెంచేసింది. అనునిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో క్యాబ్ సర్వీస్ చార్జీలు పెంచక తప్పడం లేదని తెలిపింది. క్యాబ్ డ్రైవర్ల భారం తగ్గించడానికి ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ట్రిప్ ప్రయాణ చార్జీలు 12 శాతం పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా-సౌతాసియా సెంట్రల్ ఆపరేషన్స్ అధిపతి నితీశ్ భూషణ్ చెప్పారు.
కొన్ని వారాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్లో పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటాం అని నితీశ్ భూషణ్ తెలిపారు. బేస్ చార్జీకి అనుగుణంగానే ప్రయాణ చార్జీ పెరుగుతుందే కానీ, ప్రయాణ సమయాన్ని బట్టి కాదని తదుపరి ఉబర్ వివరణ ఇచ్చింది.