Twitter CEO Parag | టెస్లా సీఈవో ఎలన్మస్క్ టేకోవర్ చేసుకోవడం ఖాయం అయ్యాక మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పూర్తిగా ఎలన్మస్క్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ నుంచి ఉద్యోగుల సామూహిక వలసలను మేనేజర్లు ఎలా నియంత్రిస్తారని ఓ ఉద్యోగి ప్రశ్నించాడు. ట్విట్టర్ ఉద్యోగుల సమావేశంలో సదరు ఉద్యోగి ఆగ్రహంతో అడిగిన ప్రశ్న సీఈవో పరాగ్ అగర్వాల్కు కోపం తెప్పించింది. దీంతో సదరు ఉద్యోగిని నోరుమూసుకోమని పరాగ్ అగర్వాల్ గట్టిగా అరిచి చెప్ఆడు.
44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఎలన్మస్క్ వాక్స్వాతంత్య్రం విధానానికి, ట్విట్టర్ కంటెంట్ మోడరేషన్ ప్రాక్టీసెస్కు టాప్ ఎగ్జిక్యూటివ్లే కారణం అని పదేపదే విమర్శిస్తూ వచ్చారు. రోజువారీగా సిబ్బంది వలసల ( attrition ) ను నియంత్రిస్తామని శుక్రవారం జరిగిన రహస్య సమావేశంలో ఎగ్జిక్యూటివ్లు చెప్పినట్లు సమాచారం.
ట్విట్టర్ కొనుగోలుకు రుణాలు తీసుకునేందుకు బ్యాంకుల ముందుకు వెళ్లిన ఎలన్మస్క్.. బోర్డు, ఎగ్జిక్యూటివ్ల వేతనాలు తగ్గించేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఎంత మొత్తంలో వేతనాలు తగ్గిస్తారన్నది మాత్రం తెలియరాలేదు. ట్విట్టర్ యాజమాన్యం మారే వరకు ఎలన్మస్క్ కీలక నిర్ణయాలు తీసుకోలేని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.