న్యూఢిల్లీ, మే 14: ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారుతున్న మాత్రాన కంపెనీ బాగుకోసం నిర్ణయాల్ని తీసుకోకుండా ఉండలేమని ఆ సంస్థ సీఈవో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. కంపెనీ లీడర్షిప్ టీమ్లో కొంతమంది ఎగ్జిక్యూ టివ్లను తొలగించటం కార్యకలాపాల్లో పలు మార్పుల్ని అగర్వాల్ ప్రకటించిన నేపథ్యంలో…ట్విట్టర్ ఎలాగూ టేకోవర్ అయ్యేదే, వెళ్లిపోయే సీఈవో ఈ మార్పులు ఎందుకు చేస్తున్నట్టని కొంతమంది నుంచి ఎదురైన ప్రశ్నలకు స్పందిస్తూ అగర్వాల్ వరుస ట్వీట్లు చేశారు.
అన్ని సందర్భాలకు, కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ట్విట్టర్ సిద్ధంగా ఉండాలన్నారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు ప్రకటించిన 44 బిలియన్ డాలర్ల కొనుగోలు లావాదేవీని నిలుపుచేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ మేలు కోసం తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాల్ని తప్పించుకోవడానికి టేకోవర్ లావాదేవీని తానుగానీ, ట్విట్టర్లో మరే లీడర్గానీ సాకుగా చూపించరన్నారు. భవిష్యత్తులో ట్విట్టర్ ఎవరి సొంతం అయినప్పటికీ, కస్టమర్లకు,పార్టనర్లకు, షేర్హోల్డర్లకు, యూజర్లకు ఒక ప్రొడక్ట్గా, ఒక వ్యాపారంగా సంస్థ మెరుగుదల సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కఠిన నిర్ణయాల్ని తీసుకోవడంతో సహా తన పనిని చేయడంపైనే తాను దృష్టిపెడతానన్నారు. తన ట్వీట్లను ‘టాపిక్ ఆఫ్ ద డే’ చూడవద్దని కోరారు.