హైదరాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఈఎల్).. 4 గిగావాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటు కోసం జర్మనీకి చెందిన ఇంజినీరింగ్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ విరిడిస్.ఐక్యూతో ఎంవోయూ కుదుర్చుకున్నది. అత్యంత ప్రభావవంతమైన సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీకి సంబంధించి ఐఆర్ఈడీఏ బిడ్డింగ్లో ఎస్ఎస్ఈఎల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాలీసిలికాన్, ఇంగాట్ వేఫర్, సెల్, మాడ్యుల్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు ఎస్ఎస్ఈఎల్కు విరిడిస్.ఐక్యూ సహకారం అందించనున్నది. కాగా, ట్రాన్స్మిషన్-డిస్ట్రిబ్యూషన్ రంగంలో, ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఎస్ఎస్ఈఎల్కు 25 ఏండ్లకుపైగా అనుభవం ఉన్న విషయం తెలిసిందే.