బెంగళూరు, నవంబర్ 30: టయోటా కిర్లోస్కర్ మోటర్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 64 ఏండ్లు. విక్రమ్కు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కూతురు మనాసి కిర్లోస్కర్ ఉన్నారు. మంగళవారం విక్రమ్ కిర్లోస్కర్ తుది శ్వాస విడిచారని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని సంస్థ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బుధవారం బెంగళూరులోని హెబ్బల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. విక్రమ్ కిర్లోస్కర్ అకాల మరణంపై పలువురు బిజినెస్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి.