న్యూఢిల్లీ : అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న హిలక్స్ పికప్ వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు టొయోటా ఇండియా సన్నద్ధమైంది. జపాన్కు చెందిన ఇసుజుకు హిలక్స్ దీటైన పోటీ ఇవ్వనుంది. పికప్ ట్రక్ మార్కెట్లో హిలక్స్ తనదైన ముద్ర వేస్తుందని టొయోటా భావిస్తోంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవాల మాదిరిగానే టొయోటా హిలక్స్ కూడా ఐఎంవీ2 ఆర్కిటెక్చర్తో కస్టమర్ల ముందుకు రానుంది.
టొయోటా హిలక్స్ 3000ఎంఎం వీల్బేస్తో ఇసుజుకు పలు అంశాల్లో దీటుగా పోటీ ఇస్తుంది. టూ డోర్, ఫోర్ డోర్ కాన్ఫిగరేషన్స్తో లభిస్తుంది. ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్, లాంగ్ స్లిట్ హెడ్ల్యాంప్స్ , ఫ్లేర్డ్ ఆర్చెస్, క్లాడింగ్తో టొయోటా హిలక్స్ రగ్గ్డ్ లుక్తో కస్టమర్ల ముందుకు రానుంది. టొయోటా ఫార్చూనర్ కంటే తక్కువగా రూ 25-35 లక్షల మధ్య హికప్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.