ముంబై: టొయోటా, సుజుకీ కంపెనీలు కొత్త తరహా వాహనాన్ని డెవలప్ చేస్తున్నాయి. ఇండియా కస్టమర్ల కోసం సుజుకీ సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఎస్యూవీ రానున్నది. బెంగుళూరులోని టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీలు ఈ హైబ్రిడ్ వాహనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఈ కొత్త తరహా మోడల్ వాహనాన్ని ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు రెండు కంపెనీలు వెల్లడించాయి. టొయోటా ప్రెసిడెంట్ అఖియో టొయోడా మాట్లాడుతూ.. సుజికీ కంపెనీ నుంచి కొత్త ఎస్యూవీ వస్తోందని, ఇండియన్ మార్కెట్లో సుజుకీ కంపెనీకి ఘన చరిత్ర ఉందని, ప్రస్తుతం ఆటో రంగంలో ఎలక్ట్రిఫికేషన్, కార్బన్ న్యూట్రాలిటీ లాంటి వివిధ రకాల సవాళ్లు ఉన్నాయని, అయితే టొయోటా, సుజుకీ కలిసి భారతీయ కస్టమర్లకు తగ్గ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.