Wilful Defaulters | న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలోని బ్యాంక్ల రుణాల్ని ఉద్దేశ్యపూర్వకంగా అత్యధిక మొత్తం లో ఎగవేసిన టాప్-50 జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గీతాంజలి జెమ్స్, ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్, ఆర్ఈఐ ఆగ్రో, ఏబీజీ షిప్యార్డ్లతో సహా 50 సంస్థలు.. బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు రూ. 87,295 కోట్లు ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసినట్టు రాజ్యసభకు ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కారద్ తెలిపారు. ఇందులో టాప్-10 ఎగవేతదారులు రూ.40,825 కోట్లు బ్యాంక్లకు బకాయి ఉన్నారని పేర్కొన్నారు. దేశం నుంచి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్ అత్యధికంగా రూ.8,738 కోట్లు ఎగవేసింది.
ఐదేండ్లలో 10 లక్షల కోట్ల రైటాఫ్
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,57,326 కోట్లు (2022-23 ఆర్థిక సంవత్సరపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం) రైటాఫ్ చేసినట్టు మంత్రి రాజ్యసభకు వెల్లడించారు.
టాప్-10 ఎగవేతదార్లు ఎగవేత మొత్తం (రూ.కోట్లలో)