Ola E-Scooter | దీపావళి పర్వ దినం నాటికి ఓలా ఎలక్ట్రిక్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఎస్1 వేరియంట్ మాదిరిగానే ఉండటంతోపాటు రూ.80 వేల లోపు ధరకే అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఫౌండర్ కం సీఈవో భావిష్ అగర్వాల్ ఆదివారం ట్వీట్ చేశారు. మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్తో ఎస్1 స్కూటర్ మాదిరిగానే ఈ ఈ-స్కూటర్ పని చేస్తుందని చెబుతున్నారు.
గతేడాది ఓలా ఎలక్ట్రిక్ ..ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ.99,999లకు భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఈ-స్కూటర్లు దేశంలోనే అత్యాధునిక స్కూటర్లు. మ్యూజిక్ ప్లేబ్యాక్, నేవిగేషన్, కంపానియన్ అప్లికేషన్, రివర్స్ మోడ్ తదితర అంశాలతో కూడిన మూవ్ ఓఎస్ ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. త్వరలో సింగిల్ చార్జింగ్తో 500 కి.మీ. దూరం ప్రయాణించే ఈవీ కారును కూడా మార్కెట్లోకి తేనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ఇంతకుముందే ప్రకటించింది.
ప్రతి రోజూ వెయ్యి స్కూటర్లు విక్రయిస్తామని ఓలా ప్రకటిస్తున్నా.. భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు జరుగడం ఆందోళనకరంగా ఉంది. వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండటంతో కొనుగోలు దారుల్లో తమ సేఫ్టీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.