ముంబై, సెప్టెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రారంభంలో భారీగా పెరిగిన సూచీలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనంవైపు నడిపించాయి. ప్రారంభంలో భారీగా పుంజుకున్న సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 60,676 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 412.96 పాయింట్లు నష్టపోయి 59,934.01 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 126.35 పాయింట్లు తగ్గి 17,877.40 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా 3 శాతానికి పైగా నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లు కూడా నష్టపోయాయి. కానీ, మారుతి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, లార్సెన్ అండ్ టుబ్రో, ఎస్బీఐలు మాత్రం అధికమయ్యాయి.