ముంబై, సెప్టెంబర్ 8: స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంతం ట్రేడింగ్లోనూ లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.90 పాయింట్లు ఎగబాకి 19,819.95 వద్ద ముగిసింది. గత ఆరు ట్రేడింగ్ సూచీల్లో నిఫ్టీ 473 పాయింట్లు లేదా మూడు శాతం లాభపడింది.
ఎన్టీపీసీ, టాటా మోటర్స్లు రెండు శాతానికి పైగా పెరిగి టాప్ గెయినర్గా నిలిచాయి.
ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్, పవర్గ్రిడ్, హెచ్సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, మహీంద్రా షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.
మరోవైపు, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, విప్రో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, నెస్లెలు నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు స్వల్పంగా లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే రియల్టీ 2.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.51 శాతం, పవర్ 1.49 శాతం. ఆయిల్ అండ్ గ్యాస్ 1.43 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.35 శాతం, ఎనర్జీ 1.33 శాతం చొప్పున పెరిగాయి.
మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 878.4 పాయింట్లు(1.34 శాతం), నిఫ్టీ 384.65 పాయింట్లు(1.97 శాతం) చొప్పున పెరిగాయి.
‘అంతర్జాతీయ మార్కెట్లు పతనమైనప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా పుంజుకుంటున్నాయి. అమెరికాలో నిరుద్యోగ గణాంకాల సూచీ విడుదలకానుండటం, ఆస్ట్రేలియాలో గ్యాస్ ధరలు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. కానీ, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు జోరందుకోవడం సూచీలకు దన్నుగా నిలిచాయి.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్