న్యూఢిల్లీ, జూన్ 22: వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు దిగిరావడంతోపాటు కేంద్రం తీసుకున్న చర్యలతో లీటర్ ధర రూ.15 వరకు తగ్గాయని ఫుడ్ కార్యదర్శి సుభాన్షు పాండే తెలిపారు. ఈ నెల మొదటి నుంచి సరాసరి రిటైల్ వంటనూనెలు తగ్గుతున్నాయని, పల్లి నూనె రూ.150 నుంచి రూ.190 మధ్యలోకి తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
గత వారంలో అదానీ విల్మార్, మదర్ డెయిర్లు వంటనూనె ధరను రూ.10-15 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం వంట నూనెల ధరలు తగ్గలేదు..ఇతర ఆహార ఉత్పత్తులైన గోధుమ ధరలు కూడా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. మస్టర్డ్ ఆయిల్ రూ.180.85కి తగ్గగా, వనస్పతి రూ.165, సోయా ఆయిల్ రూ.167కి, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.190కి, పామాయిల్ రూ.152కి తగ్గాయి.