హైదరాబాద్, అక్టోబర్ 20: జీవీకే గౌతమీ పవర్ లిమిటెడ్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం దివాలా ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది. ఈ మేరకు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్) తెలియజేసింది.
జీవీకే గౌతమీ పవర్ లిమిటెడ్పై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ కోడ్ 2016 కింద ఎడిల్వీజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఈఏఆర్సీ) దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్.. పైవిధంగా ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నది. ఇదిలావుంటే ఈ కేసులో మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ)గా అనిల్ కోహ్లీని ఎన్సీఎల్టీ నియమించింది.