న్యూఢిల్లీ, జూన్ 22: కొద్ది నెలలుగా రిజర్వ్బ్యాంక్ అమలు చేస్తున్న ద్రవ్య విధానం.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ హెచ్చరించారు. ఈ నెలారంభంలో జరిగిన ఎంపీసీ సమావేశపు మినిట్స్ గురువారం విడుదలయ్యాయి.
వడ్డీ రేట్ల పెంపుపై సభ్యుల మధ్య విభేదాలు పొడచూపినట్టు తెలుస్తు న్నది. ఏడాదికాలంగా జరిగిన పెంపు ప్రక్రియలో రెపో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి చేరింది. ద్రవ్య విధానం వాస్తవానికి దూరం జరిగిపోతున్నదంటూ జయంత్ వర్మ తాజా సమావేశంలో విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్థికాభివృద్ధి అంచనాలకంటే తక్కువగా ఉంటుందన్నారు. ్రఐఐఎం, అహ్మదాబాద్లో ప్రొఫెసర్ అయిన వర్మ కేంద్రం ఎంపీసీలో నియమించిన ముగ్గురు నామినీ సభ్యుల్లో ఒకరు.