హైదరాబాద్, జనవరి 9: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. రాష్ట్ర మార్కెట్లోకి రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ను పరిచయం చేసింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హెలియో 9200+ ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్+8 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ+256 జీబీ మెమొరీ కలిగిన మాడల్ ధర రూ.29,999గాను, 12జీబీ+256 జీబీ మెమొరీ కలిగిన మాడల్ ధర రూ.31,999, 12జీబీ +512 జీబీ మెమొరీ కలిగిన మాడల్ రూ.33,999గా నిర్ణయించింది. సెల్బే సంస్థ ఎండీ సోమ నాగరాజు, షియోమీ ఏపీ-టీఎస్ జోనల్ హెడ్ సయ్యద్ అన్వర్ తదితరులు హాజరయ్యారు.