హైదరాబాద్, జూన్ 15: అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. రూ.60,000 దిగువకు పడిపోయింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో గురువారం తులం పుత్తడి ధర రూ.380 క్షీణించి రూ.59,670 వద్ద నిలిచింది. వరుసగా రెండు రోజుల్లో రూ.780 విలువను కోల్పోయింది.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేసినప్పటికీ, ఈ ఏడాది మరో రెండు దఫాలు రేట్లను పెంచనున్నట్లు సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 30 డాలర్ల మేర క్షీణించి 1,945 డాలర్లకు చేరడంతో దేశీయంగా సైతం దిగివచ్చింది.