ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. మోటో జీ సిరీస్లో మోటో G30, మోటో G10 పవర్ మోడళ్లను ఆవిష్కరించింది. 6.5 అంగుళాల HD+ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భారత్లో మోటో జీ10 పవర్ ధర రూ.9,999గా ఉండగా మార్చి 16 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. మోటో జీ30 ధర రూ.10,999గా నిర్ణయించారు. మార్చి 17 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. డార్క్ పెర్ల్, పాస్టల్ స్కై కలర్లలో లభించనుంది.